ఇరాన్పై అమెరికా వైమానిక దాడుల తీవ్రతను పెంచింది. ఇందులో భాగంగా ఇరాన్లోని వంతెనలు, ఇతర కీలక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా సైన్యం దాడులు నిర్వహించింది. శుక్రవారం తెల్లవారుజామున ముగిసిన ఈ దాడుల్లో డజన్ల కొద్దీ ప్రాంతాలను అమెరికా సైన్యం ధ్వంసం చేసింది.
ఈ దాడుల వల్ల ఇరాన్లోని హొర్మోజ్గాన్ ప్రావిన్స్లో కనీసం ఏడుగురు వ్యక్తులు మరణించారు. మరోవైపు, మధ్యప్రాచ్యంలోని అమెరికా మిత్రదేశాలపై ఇరాన్ కొత్తగా క్షిపణి దాడులను ప్రారంభించింది.
ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ ఓడరేవులపై అమెరికా నౌకాదళ దిగ్బంధాన్ని తిరిగి విధించింది. చమురు రవాణాను పూర్తిగా నిలిపివేయడమే లక్ష్యంగా ఈ ఆంక్షలను అమలు చేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది.







