సినిమా నిర్మాతలు చివరకు థియేట్రికల్ రిలీజ్ తేదీని ఖరారు చేశారు. ఈ యాక్షన్-డ్రామా చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 10న థియేటర్లలో ఒకేసారి విడుదల కానుంది.

కొత్త పోస్టర్‌లో మాధవ్ యుద్ధంలో పోరాడిన సన్నివేశాలు, ఆవుకు మధ్య పేస్ ఆఫ్ దృశ్యాలు చూపిస్తున్నారు. ఈ చిత్ర కథ స్థానిక సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడి ఉంటుంది.

మోక్ష ఆర్ట్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. దర్శకుడు మంచాల్ నాగరాజ్ తొలిసారి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మయూర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.