మహిళల ప్రపంచకప్‌లో భారత్ రెండో విజయం సాధించింది. బుధవారం నెదర్లాండ్స్‌తో జరిగిన గ్రూప్‌ఎ మ్యాచ్‌లో టీమిండియా 95 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 209 పరుగులు చేసింది.

ఓపెనర్లు స్మృతి మంధా 74, షఫాలీ వర్మ 55 పరుగులు చేశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్ 17.3 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది.