కేటీఆర్ కాన్వాయ్ ముందుకు కదిలేంత వరకు పోలీసులు పెంబర్తి శివారులో దాదాపు అరగంట పాటు కాన్వాయ్ను నిలిపివేశారు. ఈ సమయంలో హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ స్తంభించింది. మంత్రి సీతక్క ఈ మార్గంలో వస్తుండగా ట్రాఫిక్లో చిక్కుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించి సీతక్క ములుగులో మీడియాతో మాట్లాడుతూ, కన్నెపల్లి పంప్హౌస్ను సురక్షితంగా వినియోగంలోకి తీసుకురావడానికి ప్రభుత్వం నిపుణులతో చర్చిస్తున్నట్లు తెలిపారు. మేడిగడ్డ పునరుద్ధరణకు కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కన్నెపల్లి పంప్హౌస్ పరిశీలనకు బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భారీ కాన్వాయ్తో వెళ్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు పెంబర్తి వద్ద కాన్వాయ్ను అడ్డుకున్నారు.
సీతక్క కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల సూచనలను ప్రభుత్వం పాటిస్తుందని వివరించారు. ఈ సూచనలు కన్నెపల్లి పంప్హౌస్ సురక్షితత్వం కోసం ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటున్నట్లు ఆమె చెప్పారు.







