బల్కంపేట బోనాల ఉత్సవాలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టిసి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకునే భక్తుల కోసం మంగళవారం మొత్తం 80 బస్సులను నడుపుతున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ బస్సులను నగరంలోని 18 డిపోల నుంచి అందుబాటులోకి తెచ్చారు. ఇందులో భాగంగా మెహదీపట్నం డిపో నుంచి 8, రాణిగంజ్, కంటోన్మెంట్, మిధాని, హెచ్సియు డిపోల నుంచి ఆరు చొప్పున బస్సులను కేటాయించారు. అలాగే కూకట్పల్లి, దిల్షుక్నగర్, కాచిగూడ డిపోల నుంచి ఐదు చొప్పున బస్సులను నడుపుతున్నారు.
వీటితో పాటు బర్కత్పురా, కుషాయిగూడ, ఫరూక్నగర్, జీడిమెట్ల, ఉప్పల్, మియాపూర్-2, ముషీరాబాద్ డిపోల నుంచి నాలుగు చొప్పున, హయాత్నగర్ డిపో నుంచి రెండు బస్సులను భక్తుల కోసం సిద్ధం చేశారు. కంటోన్మెంట్ డిపో నుంచి అదనంగా మరో మూడు బస్సులను కూడా ఈ సేవల కోసం వినియోగిస్తున్నారు.
భక్తుల సౌకర్యార్థం ఈ ప్రత్యేక బస్సులను మంగళవారం రోజంతా అందుబాటులో ఉంచుతున్నట్లు ఆర్టిసి అధికారులు స్పష్టం చేశారు.








