ప్రధాని మోడీ అమర్నాథ్ యాత్రికులకు రెండు పేజీల లేఖ రాశారు. దారిలో పరిశుభ్రత, పరిసరాల పరిరక్షణ, స్థానిక వ్యాపారుల ఉత్పత్తులు కొనుగోలు చేయాలని సూచించారు. దేశవాళీ సరుకులకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపు నిచ్చారు.
యాత్ర సాగుతున్న జమ్మూ కశ్మీర్లో అత్యంత క్లిష్టమైన మార్గం ఉంది. మోడీ యాత్రికులు అధికారులు జారీ చేసిన భద్రతా, ట్రాఫిక్ సూచనలను పాటించాలని కోరారు. ఇది అందరి భద్రతను పదిలం చేస్తుందని పేర్కొన్నారు.
యాత్ర ముగింపు దశలో రాఖీ ఇవ్వడంతో పాటు ఒక మొక్కను కానుకగా ఇవ్వాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ యాత్ర సోదరీ సోదరులకు ఆత్మీయమైన రక్షాబంధన్తో ముగుస్తుంది.
ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కూడా ఈ యాత్రకు శుభాకాంక్షలు తెలిపారు. అమర్నాథ్ యాత్రకు కాలాతీత ఆధ్యాత్మిక వారసత్వం ఉందని, భారతీయత ఇందులో వెల్లివిరుస్తుందని తెలిపారు. యాత్రికులు భారత్ వికసిత భారత్ అయ్యేందుకు సమిష్టి కృషిలో పాలుపంచుకోవాలని సంకల్పించాలని మోడీ పేర్కొన్నారు.
