కర్ణాటకలోని చిక్కమంగళూరు జిల్లా అల్దూర్ గ్రామానికి చెందిన 28 ఏళ్ల అవైస్ అహ్మద్, 2019లో తన స్నేహితుడు క్షితిజ్ ఖండేల్వాల్తో కలిసి 'పిక్సెల్' (Pixxel) అనే స్టార్టప్ను ప్రారంభించారు. బిట్స్ పిలానీలో చదువుతున్న సమయంలోనే ఉపగ్రహ ప్రాజెక్టులపై పనిచేసిన అహ్మద్, పంటల ఆరోగ్యాన్ని అంచనా వేసే ఖచ్చితమైన డేటా కొరతను గుర్తించి ఈ సంస్థను స్థాపించారు.
వీరు అభివృద్ధి చేసిన హైపర్ స్పెక్ట్రల్ ఉపగ్రహాలు పంటల ఆరోగ్యం, కాలుష్యం, మీథేన్ లీకులు మరియు పర్యావరణ మార్పులను అత్యంత సూక్ష్మంగా గుర్తించగలవు. ఈ సాంకేతికత నాసా (NASA) దృష్టిని ఆకర్షించడంతో, భూగర్భ పరిశోధనల కోసం ఆ సంస్థ పిక్సెల్తో ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ ఒప్పందంతో నాసాతో అధికారికంగా పనిచేసిన మొదటి భారతీయ ప్రైవేట్ స్పేస్ స్టార్టప్గా పిక్సెల్ గుర్తింపు పొందింది. పేదరికంలో పెరిగిన అహ్మద్, చిన్నప్పటి నుంచి సైన్స్ పుస్తకాలపై ఉన్న ఆసక్తితో ఈ స్థాయికి చేరుకున్నారు.







