కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత ప్యాడ్లర్లు సత్తా చాటారు. ఈ టోర్నీలో భాగంగా జరిగిన పోటీల్లో భారత్‌కు చెందిన 11 మంది పురుషులు, 10 మంది మహిళా క్రీడాకారులు ప్రీ-క్వార్టర్ ఫైనల్స్‌లోకి ప్రవేశించారు.

ఈ టోర్నీలో మనుష్ షా, హర్మీట్ దేశాయ్ మరియు శ్రీజా అకుల టాప్ సీడ్లుగా బరిలోకి దిగారు. వీరు తమ ప్రత్యర్థులపై విజయాలు సాధించి తదుపరి రౌండ్‌కు అర్హత పొందారు.

మనుష్ షా తన మ్యాచ్‌లో 8-11, 11-9, 11-7, 11-7, 11-4 స్కోరుతో విజయం సాధించారు. మరోవైపు హర్మీట్ దేశాయ్ 9-11, 11-8, 11-9, 11-6, 11-4 తేడాతో గెలుపొంది తన జోరును కొనసాగించారు.