మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్‌లోని ఒక కోళ్ల ఫారంలో అక్రమంగా అల్ఫ్రాజోలం తయారు చేస్తున్నట్లు గుర్తించిన ఈగల్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో తయారీ యూనిట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ వ్యవహారంలో పోలీసులు 12 మందిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడిగా ఉన్న జయప్రకాశ్ గౌడ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మరో 23 మంది నిందితులు పరారీలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

ప్రధాన నిందితుడు జయప్రకాశ్ గౌడ్ గతంలో బోయిన్‌పల్లిలోని మేధా స్కూల్‌లో అల్ఫ్రాజోలం తయారీ కేసులో అరెస్టయ్యాడు. బెయిల్‌పై విడుదలైన తర్వాత, అతను తన స్వగ్రామంలో మళ్లీ అక్రమ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేశాడు.

జయప్రకాశ్ గౌడ్ కార్యకలాపాలపై ఈగల్ ఫోర్స్ పోలీసులు నిఘా ఉంచారు. నిఘా అనంతరం చేపట్టిన ఈ దాడుల్లో యూనిట్ గుట్టురట్టు చేసి, నిందితులను అరెస్ట్ చేశారు.