స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వెల్త్ మేనేజ్మెంట్ విభాగంలో 207 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ (SO) పోస్టులను భర్తీ చేయనుంది. జోనల్ హెడ్, రీజినల్ హెడ్, ఏవీపీ వెల్త్ వంటి ఏడు రకాల ఉద్యోగాలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను బ్యాంక్ ఆహ్వానిస్తోంది. ఆసక్తి ఉన్నవారు సెప్టెంబర్ 25 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ నియామకాల్లో భాగంగా VP వెల్త్ పోస్టులు 91, AVP వెల్త్ పోస్టులు 73 ఉన్నాయి. వీటితో పాటు రిలేషన్షిప్ మేనేజర్-టీమ్ లీడ్ పోస్టులు 24, ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ పోస్టులు 4, రీజినల్ హెడ్ పోస్టులు 5, జోనల్ హెడ్ (రిటైల్) పోస్టు ఒకటి భర్తీ కానున్నాయి. అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
అభ్యర్థులు పోస్టును బట్టి ఎంబీఏ, పీజీ, సీఏ (చార్టర్డ్ అకౌంటెంట్) లేదా సీఎఫ్ఏ (చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్) ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పని అనుభవం కలిగి ఉండాలి. వయోపరిమితి పోస్టును బట్టి 23 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలని బ్యాంక్ పేర్కొంది. దరఖాస్తు ఫీజుగా రూ. 750 నిర్ణయించగా, ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.
విద్యార్హతలు, పని అనుభవం ఆధారంగా అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేస్తారు. ఎంపికైన వారికి 100 మార్కులకు పర్సనల్, టెలిఫోనిక్ లేదా వీడియో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఎన్ని రౌండ్ల ఇంటర్వ్యూలు నిర్వహించాలనేది అభ్యర్థుల సంఖ్యను బట్టి బ్యాంక్ నిర్ణయిస్తుంది.
దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు నోటిఫికేషన్ను పూర్తిగా చదవాలని బ్యాంక్ సూచించింది. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు https://sbi.bank.in/ వెబ్సైట్ను సందర్శించవచ్చు.







