BSNL సరికొత్త శాటిలైట్ ఫోన్ను భారతదేశంలో లాంచ్ చేసింది. మొబైల్ టవర్లు లేని అత్యంత మారుమూల ప్రాంతాల్లో కూడా ప్రజలు ఒకరికొకరు కనెక్ట్ అవ్వడానికి ఇది సహాయపడుతుంది.
ఇది సాధారణ స్మార్ట్ఫోన్ల లాగా కాకుండా పనిచేస్తుంది. సెల్యులార్ నెట్వర్క్ల స్థానంలో ఇన్మార్షాట్ వంటి గ్లోబల్ శాటిలైట్ నెట్వర్క్ల ద్వారా కనెక్ట్ అవుతుంది. సిగ్నల్ లేని అడవులు, కొండ ప్రాంతాల్లో కూడా వాయిస్ కాల్స్ సులభంగా చేయవచ్చు.
ఈ ఫోన్లో SOS ఎమర్జెన్సీ సపోర్ట్, లాంగ్ బ్యాటరీ లైఫ్, రగ్గడ్ డిజైన్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. రక్షణ, సముద్రయానం, విపత్తు నిర్వహణ, మైనింగ్ రంగాల్లో పనిచేసేవారికి ఇది ప్రత్యేకంగా రూపొందించబడింది.
ఈ ఫోన్ కొనుగోలు సాధారణ వినియోగదారులకు కాదు. రక్షణ, మైనింగ్ సంస్థలు, విపత్తు నిర్వహణ బృందాలు వంటి ప్రత్యేక రంగాల వారికి మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. ఉపయోగించడానికి కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ అనుమతి తప్పనిసరి. అనుమతి లేకుండా ఈ ఫోన్ను కలిగి ఉండటం చట్టవిరుద్ధం.
ఇదివరకు బిఎస్ఎన్ఎల్ తన 4G నెట్వర్క్ను దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం దాదాపు 99,000 సైట్లను ప్రారంభించినట్లు సంస్థ తెలిపింది.








