రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి, రైతుల జీవితాల్లో ఆనందం నిండాలని ఆకాంక్షిస్తూ ఈ వరుణ యాగాన్ని చేపట్టారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ అర్చకులు, వేదపండితుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ యాగంలో 108 మంది రుత్వికులు పాల్గొన్నారు. మొత్తం 11 హోమగుండాలను ఏర్పాటు చేసి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
యాగం చివరలో నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సతీమణితో కలిసి పాల్గొన్నారు. ఈ పూజా కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో వర్షాలు కురవాలని వారు ఆకాంక్షించారు.








