బాక్సాఫీస్ వద్ద హాలీవుడ్ సూపర్ హీరో చిత్రం ‘స్పైడర్ మేన్: బ్రాండ్ న్యూ డే’ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలకు పోటీగా వసూళ్లను రాబడుతున్న ఈ చిత్రం, భారతదేశంలో ఇప్పటివరకు ఏ హాలీవుడ్ సినిమా సాధించని అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. విడుదలైన కేవలం 11 రోజుల్లోనే ఈ చిత్రం రూ. 428 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టి ఆల్ టైమ్ రికార్డు నమోదు చేసింది. మొదటి రోజు నుంచే థియేటర్లలో ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి విశేష ఆదరణ లభించడంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఊహించని స్థాయిలో వసూళ్లను సాధిస్తోంది.
ఇప్పటివరకు భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ చిత్రంగా ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. జేమ్స్ కామెరూన్ డైరెక్షన్ లో వచ్చిన అవతార్ 2 చిత్రం హాలీవుడ్ తో పాటు ఇండియాలోనూ రికార్డ్స్ క్రియేట్ చేసింది.2022లో వచ్చిన అవతార్ 2.. భారత్లో రూ. 390 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించి అగ్రస్తానంలో నిలిచింది. ఇప్పుడు ‘స్పైడర్ మేన్: బ్రాండ్ న్యూ డే’ ఆ రికార్డును అధిగమించి భారత్లో నంబర్ 1 స్థానానికి చేరుకుంది. ఇండియాలో స్పైడర్ మేన్ హోమ్కమింగ్తో స్టార్ట్ అయిన రికార్డుల పరంపర ఫార్ ఫ్రమ్ హోమ్తో వంద కోట్ల మార్క్.. నో వే హోమ్తో రెండొందల కోట్ల రికార్డ్ క్రియేట్ చేసి ఇప్పుడు బ్రాండ్ న్యూడేతో నాలుగు వందల కోట్ల నుంచి రూ. 500 కోట్ల మార్క్ ను కూడా అందుకునేలా ఉన్నాడు స్పైడర్ మ్యాన్. ఈ సినిమాతో ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్’కు ఇండియాలో ఎంత పెద్ద మార్కెట్ ఉందొ నిరూపించింది.








