న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ అంశంపై నిరసనలు కొనసాగుతున్నటంపై కేంద్ర ప్రభుత్వం స్పందించి, ఈ అంశంపై పార్లమెంటులో సమగ్ర చర్చ జరిపేందుకు సిద్ధంగా ఉందని బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు మరియు రాజ్యసభలో అధికార పక్ష నేత జేపీ నడ్డా హామీ ఇచ్చారు.

ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు నడ్డా. రాహుల్ గాంధీ మరియు ఇతర రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం విమర్శించారు. 'సమస్య తీవ్రత దృష్ట్యా దీనిపై లోతైన చర్చ జరగాల్సి ఉంది' అని పేర్కొన్నారు.

UPA హయాంలో కేరళ, పంజాబ్, కర్ణాటక, పశ్చిమబెంగాల్ మరియు తమిళనాడులో పేపర్ లీక్‌లు జరిగాయని నడ్డా గుర్తుచేశారు. 'రాహుల్ గాంధీ ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదు? ఇండియా కూటమి ప్రభుత్వాలను ఎందుకు ప్రశ్నించడం లేదు?' అని ప్రశ్నించారు. విద్యార్థుల సమస్యలను రాజకీయ లాభాల కోసం ఉపయోగించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు.

ప్రభుత్వం నుంచి జవాబుదారీతనం కోరుతున్నారని విపక్షాలు ఆరోపించినట్లయితే, నడ్డా దీనిని ఖండించారు. 'లీకేజీలపై సమగ్ర విచారణ జరగాల్సిందే' అని పేర్కొన్నారు.