ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని ప్రముఖ క్రీడాకారిణి, అర్జున అవార్డు గ్రహీత ఈషా సింగ్ మర్యాదపూర్వకంగా కలిశారు. మ్యూనిచ్‌లో జరిగిన అంతర్జాతీయ షూటింగ్ వరల్డ్ కప్ 2026 పోటీల్లో స్వర్ణ పతకం సాధించి ఈషా సింగ్ ప్రపంచ రికార్డును కైవసం చేసుకున్నారు.

ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో కలిసిన సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఈషా సింగ్‌ను సత్కరించి అభినందించారు.