తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఉద్యోగి రాహుల్ యాదవ్తో ముగ్గురు నిందితులను ఈనెల 10వ తేదీన రేణిగుంట పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో 63 గ్రాముల సింథటిక్ మెథాంఫెటమైన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ నెట్వర్క్ విద్యార్థులను టార్గెట్ చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
రాహుల్ యాదవ్ తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ అర్చక భవన్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. ఈ సంస్థలో పనిచేస్తూ డ్రగ్స్ అక్రమ వ్యాపారం చేస్తున్నారనే ఆరోపణలతో అతన్ని అరెస్ట్ చేసారు. ఈ విషయం భక్తులు, సహోద్యోగులలో తీవ్ర ఆందోళన సృష్టించింది.
పోలీసులు ఈ ముఠా వెనుక ఉన్న వ్యక్తులు, డ్రగ్స్ సరఫరా మార్గాల గురించి లోతుగా విచారణ చేస్తున్నారు. నగరంలో డ్రగ్స్ వ్యాపారాన్ని పూర్తిగా అణచివేయడానికి 'బయో చెక్ టెస్టులు'తో కఠిన చర్యలు చేపట్టారు. నిందితుల మానసిక స్థితి, డ్రగ్స్ సరఫరా నెట్వర్క్ను పూర్తిగా విచ్ఛిన్నం చేయడం లక్ష్యం.







