కౌటాల: ప్రతిరోజూ యోగా చేస్తే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని యోగా ఇన్‌స్ట్రక్టర్‌ దాసరి వినోద్‌గౌడ్‌ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో బుధవారం కౌటాల పంచాయతీ కార్యాలయంలో యోగాపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ యోగాతో మానసిక ప్రశాంతత ఉంటుందన్నారు. దైనందిన కార్యక్రమాల్లో భాగం చేసుకోవాలని సూచించారు. యోగాతో జాప్ఞకశక్తి పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ డబ్బా గోపాల్‌, కార్యదర్శి కై లాస్‌, యోగా శిక్షకురాలు రోజా, నాయకులు తిరుపతి, ప్రభాకర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.