వందే భారత్, రాజధాని లాంటి ప్రీమియం రైళ్లు నిర్ణీత సమయం కంటే రెండు గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఆలస్యమైతే ప్రయాణికులకు ఉచితంగా ఆహారం అందించబడుతుంది.

రైల్వే వ్యవస్థలో అనేక నియమ నిబంధనలు ఉన్నప్పటికీ, ప్రీమియం రైళ్ల విషయంలో ఆలస్యం జరిగినప్పుడు ప్రయాణికులకు ప్రత్యేక ప్రయోజనాలు కల్పిస్తున్నారు.

భారతీయ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) నిబంధనల ప్రకారం, రైలు రెండు గంటలకు మించి ఆలస్యమైన సందర్భాల్లోనే ఈ ఉచిత ఆహార సౌకర్యం వర్తిస్తుంది.