‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ ఫేమ్ విక్రమ్ సాహిదేవ్, సంధ్యా వశిష్ట జంటగా నటిస్తున్న చిత్రం ‘అనకాపల్లి’. ఖగేష్ తమ్మినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ను విశాఖపట్నంలో జరిగిన ఎలైట్ క్రికెట్ లీగ్ సీజన్ 2లో విడుదల చేశారు. నటులు శ్రీకాంత్, తమన్ సారథ్యంలోని టాలీవుడ్ థండర్స్ టీం ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ ట్రైలర్ హీరోహీరోయిన్ల మధ్య సాగే ప్రేమకథతో పాటు, తారక్ పొన్నప్ప విలనిజం, యాక్షన్ సన్నివేశాలను హైలైట్ చేస్తోంది. ‘పుష్ప 2’లో విలన్గా నటించిన తారక్ పొన్నప్ప ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. మధ్యతరగతి తల్లిదండ్రుల పాత్రల్లో దర్శకుడు త్రినాథరావు నక్కిన, నటి ఇంద్రజ కనిపించనున్నారు.
నక్కిన నరేటివ్స్, భవ్య శ్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై త్రినాథరావు నక్కిన, నాయుడు కాండ్రేగుల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్ప్లే అందించడమే కాకుండా ఒక ముఖ్య పాత్రలో కూడా నటిస్తున్నారు. డావ్జాండ్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.
ఈ సినిమాలో ఇంద్రజ అబ్బర్, మహబూబ్నగర్ భాషా, శ్రీనివాస్ వడ్లమాని, కాండ్రేగుల నాయుడు, నందినీ రాయ్, సంగీత ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. యూత్, మాస్ ఆడియెన్స్ను ఆకట్టుకునేలా లవ్, యాక్షన్ అంశాలతో ఈ ట్రైలర్ను రూపొందించారు.







