Revanth Reddy US Tour |హైదరాబాద్‌, ఆగస్టు 21 (స్పెషల్‌ టాస్క్‌ బ్యూరో, నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతిని నిరాకరించడంపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఈ క్రమంలో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ స్పందించారు. అనుచిత సమావేశాల వల్లే అనుమతిని నిరాకరించామని, ముఖ్యమంత్రి హోదాకు, ఉద్దేశానికి అనుగుణంగా ఈ పర్యటన లేదని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

రణధీర్‌ జైస్వాల్‌ మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రులతోపాటు ఇతర ప్రముఖుల వి దేశీ పర్యటనలకు అనుమతులు మంజూ రు చేసేముందు విదేశీ వ్యవహారాల శాఖ సమీక్షిస్తుంది. విదేశీ పర్యటనకు రాజకీయ అనుమతి పొందాలంటే.. ప్రతిపాదిత కా ర్యక్రమం ప్రస్తుతం నిర్వహిస్తున్న హోదా కు, పర్యటన ఉద్దేశానికి తగ్గట్టు ఉండాలి. సీఎం రేవంత్‌ అమెరికా పర్యటన ఈ విషయంలో అనుచితం (నాట్‌ అప్రొప్రియేట్‌)గా ఉన్నది. అందుకే, అనుమతి నిరాకరించాం. ఇదే సమయంలో యూకే పర్యటనకు అనుమతి ఇచ్చాం’ అని తెలిపారు.

ముఖ్యమంత్రుల విదేశీ పర్యటనలకు కేంద్రం అనుమతిని నిరాకరించడం కొత్తేమీ కాదు. గతంలోనూ పలువురు సీఎంల విదేశీ పర్యటనల అభ్యర్థనలను కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ నిరాకరించింది. ఈ జాబితాలో పంజాబ్‌ సీఎం భగవంత్‌సింగ్‌ మాన్‌(చెక్‌ రిపబ్లిక్‌, నెదర్లాండ్స్‌, యూకే, ఇజ్రాయెల్‌-2026, ఫ్రాన్స్‌-2025), బెంగాల్‌ మాజీ సీఎం మమతా బెనర్జీ (నేపాల్‌, ఇటలీ-2021, అమెరికా-2018), ఢిల్లీ మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (సింగపూర్‌-2022, డెన్మార్క్‌-2019), జార్ఖండ్‌ మాజీ సీఎం అర్జున్‌ (థాయ్‌లాండ్‌-2012), అస్సాం మాజీ సీఎం తరుణ్‌ గొగొయి (ఇజ్రాయెల్‌, అమెరికా-2012) తదితరులు ఉన్నారు.