అట్లాంటా వేదికగా జరిగిన సెమీఫైనల్ పోరులో ప్రస్తుత వరల్డ్ ఛాంపియన్స్ అర్జెంటీనా 2-1 స్కోరుతో ఇంగ్లాండ్ను ఓడించింది. ఈ గెలుపుతో అర్జెంటీనా జట్టు ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది.
ఈ విజయంపై అర్జెంటీనా అభిమానులు దేశంలోనూ, అమెరికాలోనూ సంబరాలు చేసుకుంటున్నారు. వీధుల్లో నృత్యాలు చేస్తూ తమ జట్టు సాధించిన ఈ ఘనతను వారు వేడుకగా జరుపుకుంటున్నారు.
ఇక ఫైనల్ మ్యాచ్పై అందరి దృష్టి నెలకొంది. జూలై 19న స్పెయిన్తో జరగనున్న తుది పోరు కోసం అర్జెంటీనా జట్టు సిద్ధమవుతోంది.








