జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా భారత్తో జరిగిన టీ20 సిరీస్ తర్వాత మీడియాతో మాట్లాడుతూ, ఈ సిరీస్లో తమ జట్టు చూపించిన ప్రదర్శనపై గర్వం వ్యక్తం చేశారు. ప్రపంచంలోని అగ్రశ్రేణి జట్లతో ఆడటం ద్వారా మాత్రమే ఏ జట్టు అయినా అభివృద్ధి చెందుతుందని, ఈ అనుభవం తక్కువ ర్యాంకింగ్ ఉన్న జట్లకు కూడా ఉపయోగపడుతుందని రజా వివరించారు.
ఈ సిరీస్లో జింబాబ్వే యువ ఆటగాడు న్యూమన్ న్యామ్హురి రూపంలో మంచి బౌలర్గా ఉందని, లోయర్ ఆర్డర్లో మరుమాని బ్యాటింగ్తో పాటు మధెవెరె కూడా మంచి పరుగులతో ఆకట్టుకున్నారని రజా ప్రశంసించారు. జట్టు డ్రెస్సింగ్ రూమ్ సంస్కృతిలో మార్పులు తీసుకురావడానికి కొంతకాలంగా కృషి చేస్తున్నామని, ఓటమి సమయంలో కూడా ఆటగాళ్లు ఒకరికొకరు మద్దతుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.
సిరీస్లో తాను పరుగులు చేయలేకపోయినందుకు కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన రజా, “త్వరలోనే కొన్ని పరుగులు కొనుక్కుంటా” అని హాస్యంగా వ్యాఖ్యానించారు. నమీబియాతో జరగబోయే ముక్కోణపు సిరీస్లో తాను మళ్లీ ఫారంలోకి వచ్చి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తానని, ఆ రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.







