AI సాయంతో రూపొందించిన కంటెంట్ను గుర్తించేందుకు న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న Pangram స్టార్టప్ 9 మిలియన్ డాలర్ల నిధులను సేకరించింది. పెరుగుతున్న AI వినియోగం, తద్వారా జరుగుతున్న దుర్వినియోగాన్ని అరికట్టే లక్ష్యంతో ఈ సంస్థ తన సాంకేతికతను అభివృద్ధి చేస్తోంది.
ఈ సంస్థ రూపొందించిన కొత్త టెక్స్ట్ డిటెక్షన్ మోడల్, AI సాయంతో రాసిన రాతలను మరియు మనుషులు, AI కలిసి రూపొందించిన కంటెంట్ను 99 శాతానికి పైగా ఖచ్చితత్వంతో గుర్తిస్తుంది. పదుల మిలియన్ల కొద్దీ మానవ రాత ప్రతులను ఉపయోగించి ఈ లార్జ్ మెషిన్ లెర్నింగ్ మోడల్కు శిక్షణ ఇచ్చారు. అంతేకాకుండా, AI హ్యూమనైజర్ ప్రోగ్రామ్లను కనిపెట్టడంతో పాటు, కంటెంట్లో AI ఎంతవరకు ఉందో కూడా ఇది విశ్లేషించగలదు.
ప్రస్తుతం Pangram ఇమేజ్ డిటెక్షన్ మోడల్ను కూడా సంస్థ అందుబాటులోకి తెచ్చింది. ఇది ప్రస్తుతం రీసెర్చ్ ప్రివ్యూ రూపంలో అందుబాటులో ఉంది. వినియోగదారులు సబ్స్క్రిప్షన్ ద్వారా లేదా క్రోమ్ ఎక్స్టెన్షన్ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఈ సేవలను పొందవచ్చు. క్రోమ్ ఎక్స్టెన్షన్ ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్లను రియల్ టైమ్లో ఆటోమేటిక్గా లేబుల్ చేసే అవకాశం ఉంది.
విద్యా సంస్థలు, ఇతర కార్యాలయాలు AI కంటెంట్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కొత్త నిబంధనలను అమలు చేస్తున్న తరుణంలో ఈ సాంకేతికత ప్రాధాన్యత సంతరించుకుంది.








