కటక్లో పోలీసులు బిశ్వజిత్ అనే యువకుడిని అరెస్టు చేశారు. అతడు ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝిని కించపరిచేలా ఏఐ టూల్స్తో రూపొందించిన వీడియోలు, ఫొటోలు, రీల్స్ను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు.
సైబర్ క్రైమ్ విభాగం రోజువారీ తనిఖీల్లో ఈ వీడియోలను గుర్తించింది. అవి వైరల్ అవుతున్నట్లు గుర్తించిన తర్వాత అరెస్టు చేశారని పోలీసులు వెల్లడించారు.
నిందితుడిపై సైబర్ క్రైమ్ మరియు ఆర్థిక నేరాలకు సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతడు ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకుని అసభ్యకర వ్యాఖ్యలు చేశాడని పోలీసులు పేర్కొన్నారు.
పోలీసులు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేసి కష్టాలు కొని తెచ్చుకోవద్దని ఉపయోగిస్తున్న వారిని హెచ్చరించారు.








