నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తికి గురువారం చేరుకున్న సీపీఎస్ ఉద్యోగుల జనజాగరణ బస్సుయాత్రలో రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ మాట్లాడారు. సీపీఎస్ (కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్తో ఈ యాత్రను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తమ మ్యానిఫెస్టోలో సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చిందని స్థితప్రజ్ఞ గుర్తు చేశారు. అయితే, ఆ పార్టీ అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడుస్తున్నా, ఇప్పటివరకు ఈ అంశంపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, వెంటనే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.








