కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది సోదరులు ఉన్నప్పుడు, ముందుగా పెద్ద అన్నయ్యకు రాఖీ కట్టి ఆ తర్వాత తమ్ముళ్లకు కట్టడం సంప్రదాయంగా వస్తోంది. పెద్దలకు గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ క్రమాన్ని పాటిస్తారు. అయితే, సోదరులు ఎక్కడ కూర్చున్నారు లేదా ఎవరు ముందుగా వచ్చారు అనే దానిపై రాఖీ కట్టాలనే కఠినమైన నిబంధనలు ఏవీ లేవు.
రాఖీ కట్టే సమయంలో సోదరుడు ఏ స్థానంలో ఉన్నాడనే దానికంటే, సోదరీమణుల మధ్య ఉండే ప్రేమ, ఆప్యాత్యతలే ముఖ్యమని గుర్తుంచుకోవాలి. కుటుంబ పరిస్థితుల వల్ల ఒకవేళ ముందుగా తమ్ముడికి రాఖీ కట్టినా, అది అపశకునం కాదని గ్రహించాలి. ఈ పండుగ అసలు ఉద్దేశం సోదరసోదరీమణుల మధ్య అనుబంధాన్ని మరింత బలపరచుకోవడమే.
రాఖీ కట్టే ముందు చాలా కుటుంబాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఏ శుభకార్యానికైనా ముందుగా గణేశుడిని స్మరించడం ఆనవాయితీ. అందుకే రాఖీ కట్టడానికి ముందు గణేశుడిని ప్రార్థించి, కుటుంబ సభ్యులందరికీ సుఖసంతోషాలు కలగాలని కోరుకుంటారు.
కొన్ని కుటుంబాల్లో రాఖీని ముందుగా ఇష్టదైవం లేదా కులదేవతకు సమర్పించి పూజించిన తర్వాతే సోదరులకు కడతారు. ఇలాంటి పద్ధతులు ఆయా కుటుంబాల ఆచారాలను, ప్రాంతీయ సంప్రదాయాలను బట్టి మారుతుంటాయి. కొన్ని ప్రాంతాల్లో వాహనాలకు, ఇంట్లోకి కొత్తగా తెచ్చిన వస్తువులకు, పెంపుడు జంతువులకు కూడా రాఖీ కట్టి రక్షణ కోరుకోవడం కనిపిస్తుంది.
చివరగా, రాఖీ కట్టే క్రమంపై కుటుంబ సంప్రదాయాలను పాటించడం మంచిదే అయినా, ఏదైనా తేడా వస్తే భయపడాల్సిన అవసరం లేదు. ఈ పండుగ సారాంశం పరస్పర రక్షణ, గౌరవం మాత్రమే. ఈ సమాచారం మత విశ్వాసాల ఆధారంగా అందించబడింది, దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవని గమనించాలి.








