రాహుల్ గాంధీ పూణేలో జరగనున్న 'చత్రోన్ కీ గూంజ్' అనే కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారు. విద్యా రంగంలో ఉన్న సమస్యలను చర్చించడం, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం.
ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మహిళాభ్యుదయానికి సంబంధించిన అంశాలపై రాహుల్ గాంధీ దృష్టి సారించనున్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సవాళ్లు, మహిళల అభివృద్ధికి అవసరమైన మార్పులపై ఇందులో చర్చ జరగనుంది.
ఆగష్టు 22న ఈ కార్యక్రమం జరగనుందని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే, పూణే నగరంలో ఈ సభను ఎక్కడ నిర్వహించాలనే దానిపై పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.







