భారత అంతరిక్ష కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా నమ్మకమైనదిగా, తక్కువ ఖర్చుతో కూడినదిగా గుర్తింపు పొందింది. చంద్రయాన్, మార్స్ ఆర్బిటర్ మిషన్ వంటి విజయవంతమైన ప్రయోగాలతో భారత్ అంతరిక్ష రంగంలో కీలక మైలురాళ్లను అధిగమించింది. ఈ నేపథ్యంలో 2035 నాటికి భారత అంతరిక్ష రంగం విలువ 1.8 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.
ప్రస్తుతం భారతీయ ప్రైవేట్ సంస్థలు అత్యాధునిక అంతరిక్ష సాంకేతికతలను అభివృద్ధి చేస్తున్నాయి. ఇవి అంతర్జాతీయ పెట్టుబడులను, కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి.
భారత్ తన అంతరిక్ష వ్యవస్థను అంతర్జాతీయ స్థాయికి విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గ్లోబల్ సౌత్, ఇండో-పసిఫిక్ దేశాలకు సమగ్ర భాగస్వామ్యాలను అందించేందుకు భారత్ సిద్ధంగా ఉంది.








