టాలీవుడ్ హీరోలు నటనకే పరిమితం కాకుండా, నిర్మాతలుగా మారి సినిమాలు నిర్మించడం ఇప్పుడు ట్రెండ్గా మారింది. ఇప్పటికే మహేష్ బాబు తన GMB బ్యానర్పై 'రావు బహదూర్' వంటి సినిమాలు నిర్మిస్తుండగా, రామ్ చరణ్ 'ఖైదీ నెం 150', 'ఆచార్య' వంటి భారీ చిత్రాలను నిర్మించారు. ఇదే బాటలో నాని కూడా 'హిట్' సిరీస్తో పాటు నితిన్తో 'అలియాస్ రుక్మిణి' చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఎన్టీఆర్ కూడా నిర్మాతగా అడుగులు వేస్తున్నారు. తన పేరులోని అక్షరాలు వచ్చేలా 'NTRTAIN' అనే కొత్త ప్రొడక్షన్ బ్యానర్ను ఆయన ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే ఈ బ్యానర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది.
ఈ కొత్త నిర్మాణ సంస్థను ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి పర్యవేక్షించనున్నారు. త్వరలోనే ఈ బ్యానర్ ద్వారా సినిమాలు పట్టాలెక్కనున్నాయి. ఇందులో కేవలం పెద్ద సినిమాలే కాకుండా, మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలను కూడా నిర్మించాలని ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నారు.
మరోవైపు, ఎన్టీఆర్ ప్రస్తుతం 'డ్రాగన్' సినిమా షూటింగ్లో ఉన్నారు. అయితే, గాయం కారణంగా ఆయన విశ్రాంతి తీసుకుంటుండటంతో షూటింగ్కు చిన్న విరామం వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా, ఆయన కోలుకున్నాక తిరిగి ప్రారంభం కానుంది.
'డ్రాగన్' పూర్తయిన తర్వాత, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 'గాడ్ ఆఫ్ వార్' సినిమా చేయబోతున్నారు. సుబ్రహ్మణ్య స్వామి ఇతిహాసాల ఆధారంగా రానున్న ఈ మైథలాజికల్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం 'గాడ్ ఆఫ్ వార్', 'దేవసేనాపతి' అనే టైటిల్స్ను రిజిస్టర్ చేయించినట్లు సమాచారం.
ప్రస్తుతం త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం' సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. అది విడుదలయ్యాక ఎన్టీఆర్ సినిమాపై దృష్టి పెట్టనున్నారు. ఎన్టీఆర్ కోలుకున్నాక 'డ్రాగన్' షూటింగ్ షెడ్యూల్ మళ్లీ మొదలవుతుంది.








