ICC మహిళల T20 ప్రపంచకప్లో పాకిస్తాన్ తన నాల్గో మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన పాక్, మంగళవారం ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మ్యాచ్లో 200 పరుగుల లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైంది.
ఆస్ట్రేలియా జట్టు 20 ఓవర్లలో 199 పరుగులు చేసి బలమైన బ్యాటింగ్ ప్రదర్శన ఇచ్చింది. మునీబా అలీ 32 పరుగులతో పాక్ బ్యాటింగ్లో అత్యధిక స్కోర్గా నిలిచింది. సోఫీ, సదర్లాండ్స్, ఎలిస్ పెర్రీలు తలా రెండు వికెట్లు తీసుకుని ఆస్ట్రేలియా బౌలింగ్ దళం పాక్ను కుప్పకూల్చింది.
ఈ విజయంతో ఆస్ట్రేలియా నాకౌట్ స్టేజ్కు అర్హత సాధించింది. భారత్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నది. భారత్ జట్టు గురువారం బంగ్లాదేశ్తో కీలకమైన మ్యాచ్ ఆడనుంది.





